Thursday, February 19, 2015

కధల పోటీలు

బృందావనం కధల పోటీలు ..

బృందావనం తరపున బృందావనం సభ్యులు నివాస ప్రాంతాలల్లో చిన్న పిల్లలికి కధల పోటీ పెట్టాలని అనుకున్నాము ... 

ఉగాది నాడు ఈ పోటీ పెట్టాలని ... నిజానికి ఇది పోటీ కాకపోయినా ... పిల్లలిని encourage చేసేందుకు ఇలా పోటీ అన్న మాట వాడటం జరిగింది ... 

మొత్తం మూడు చోట్ల ఈ కార్యక్రమం నిర్వహించారు 

గీత గారు , ముగ్ధ గారు , తనూజ గారు ముగ్గురు ఈ పోటీలు నిర్వహించారు ... 

మొత్తం మీద ... మాకు కలిగిన అనుభూతి ఏంటంటే ... 

పిల్లలికి కధలు వినాలని, చదవాలని ఆసక్తి ఉంది 

అయితే పేరెంట్స్ అందుకు సంబంధించిన పుస్తకాలు కొని ఇవ్వకుండా ఎక్కువగా టివి అలవాటు చేస్తున్నారు ... 

మేము బృందావనం లో ప్రతి మాసం ఒక పుస్తకం చదువుతాము నెల చివరి వారం ఆ పుస్తకాన్ని ఎవరు ఎ కోణం లోనుంచి అర్ధం చేసుకున్నామో వివరిస్తాము ... 

ఇలాగే ప్రతి ఇంట్లో కనీసం వారానికి ఒక్క కధ పిల్లలికి చెప్పి , తిరిగి వారితో చెప్పించి ఇలా చెప్పిస్తున్నప్పుడు ఇంట్లో వారు అందరు చక్కగా, శ్రద్ధగా ( టివి లు మొబైల్స్ ప్రక్కన పెట్టి ) పిల్లలు చెప్పే కధలు వింటే ... ఆ బంధాలలో ఎంతో మార్పు వస్తుంది ... 

ఈ మొత్తం లో ఒకరిద్దరు పేరెంట్స్ ఆసక్తి చూపించకపోయినా పిల్లలు మాత్రం ఎంతో ఆసక్తిగా పాల్గొన్నారు 
అందరికి బృందావనం తరపున పుస్తకాలు కానుకగా ఇవ్వడం జరిగింది 

ఈ కార్యక్రమం మొత్తం చక్కగా నిర్వహించిన గీత గారికి, ముగ్ధ గారికి, తనూజ గారికి నా తరపున , బృందావనం తరపున కూడా ధన్యవాదాలు 

ఇక గీత గారు నిర్వహించిన పోటీ వివరాలు ... వారి మాటల్లోనే ... ( హైదరాబాద్ లో )

1. మొత్తం 12మంది  పేర్లు ఇచ్చారు 

2. అందులో 7 గురు మాత్రం పాల్గొన్నారు.. మిగతావారు అనేక కారణాల వలన పాల్గొనలేకపోయారు ..

3. వాళ్ళలో ఒక చిన్న బాబు 5 ఏళ్ళు అందుకే వాడికి ఇంగ్లీష్ లో చెప్పే అవకాశం ఇచ్చాను 

4. పిల్లలు శ్రద్దగానే ఉన్నారు వినే ఓపిక పెద్ద వాళ్ళకే లేదు 

5. మంచి పుస్తకాలు బహుమతిగా ఇచ్చారు అని ఇద్దరు పిల్లలు వచ్చి నాకు థాంక్స్ చెప్పి వెళ్ళారు 

6. కొంత మంది సగం చెప్పారు ఒకరు jumble చేసి చెప్పారు కొంత మంది మధ్య 1, 2 సార్లు ఇంగ్లీష్ పదాలు వాడారు 

7. అన్నిటికంటే బాధ అనిపించింది పేరెంట్స్ ని ఎంతో (గంట సేపు ) బతిమాలితే వినడానికి వచ్చారు 

"ఇదే పేరెంట్స్ దగ్గర ఉండి పిల్లల్ని కెవ్వు కేక పాటలు డాన్సు చేయించిన వాళ్ళు ఉన్నారు 
యశస్వి 
అది వినాయక చవితి ఉత్సవాలలో "

1.యశస్వి ఆవు - పులి కథ "బాల్యం కథలు " బుక్ లోది చెప్పాడు 
పులి ఎదురు చూస్తుంది అని చెప్పడానికి వెయిట్ చేస్తుంది అని చెప్పాడు మోరల్ చెప్పడం మర్చిపోతే మళ్ళీ చెప్పించాము "సత్యం పలికే వాళ్లకి ఎప్పుడు మంచే జరుగుతుంది " అని చెప్పాడు 
ప్రణీత 
2. ప్రణీత "తాను తీసిన గోతిలో " చెప్పింది 
ఒక నక్క ఏనుగు తో స్నేహం చేసినట్టు నటించి దానిని పులి కి ఆహారంగా ఇవ్వాలి అని అనుకుంటుంది 
ఇది గమనించిన కుందేలు అది మంచిది కాదు అని చెపితే ఏమి పర్లేదు అంటుంది అంత పెద్ద ఏనుగు ని ఎలా పడేస్తావు అంటే ఏనుగు కోసం తయారు చేసిన గోతిని చూపిస్తూ పొరపాటున అది కాలు జారి పడుతుంది ఇదంతా అటుది ఇటు , ఇటుది అటు చెప్పింది ఈ పాప "తాను తీసిన గోతిలో తానే పడతారు అనేది కథ నీతి 

3. సృజన్  "జమిందారు - భూస్వామి " కథ చెప్పాడు 
సృజన్ 
ఒక భూస్వామి కింద ఒక రైతు పొలం కౌలుకి తీసుకుంటాడు . కౌలు కింద ఏమి కావాలి అంటే నేల లోపల పండింది మొత్తం నాకు అని చెప్తాడు .. వేరు సెనగ పంట వేయడం వలన అది మొత్తం భూస్వామి కి చెందుతుంది అది తప్పు అని జమిందారు చెప్తారు అలా అడగకూడదు ఎప్పుడైనా డబ్బు రూపం లో అడగాలి అని జమిందార్ చెప్తారు తీర్పు ఇది మొత్తం కథ చెప్పలేదు తెలివిగా ఆలోచించాలి అనేది కథ నీతి 

4. ప్రజ్ఞ (చింటూ ) "గొడ్డలి కథ చెప్పింది 
ధీరజ్ 
కాని సగమే చెప్పింది దురాశ దుఖానికి చేటు అనేది నీతి 
కాని సగం చెప్పడం వలన సత్యం పలికితే మంచి జరుగుతుంది అని చెప్పింది 
సూరజ్ 
5. ధీరజ్ (Borrowed feathers )
చెప్పిన టైటిల్ కి కథ కి సంబంధం లేద

6. సూరజ్ 
కథ మొత్తం ఇంగ్లీష్ లో చెప్పాడు 

7. ఆకాష్ కాకి - గులక రాళ్ళ కథ చెప్పాడు 
తెలివి తో సాధించాలి అనేది నీతి 
ప్రజ్ఞ 


















ఇక ముగ్ధ గారు నిర్వహించిన కధల పోటీల వివరాలు ( హైదరాబాద్ లో )

పదిమంది చిన్నారుల వివరాలు ... వారు చెప్పిన కధలు ... 


1.  సాతిక్య     . 14 సంవత్సరాలు . *ఆలోచనే విజయానికి సోపానం *

2.  ప్రణతి         13సంవత్సరాలు ..  *తెనాలి రామకృష్ణ - దొంగలు *
3.  భువనేశ్      11సంవత్సరాలు *శ్రవణ కుమారుని కధ *

4.  సోనాల్         8సంవత్సరాలు ..  *ఉపకారం * (పావురం - చీమ )

5.  తన్మయి       7సంవత్సరాలు ..  *రాజు - ఏడుగురు కొడుకులు -చేపలు *

6.  పూజిత        6సంవత్సరాలు.  *ఐకమత్యం *

7.  ఉద్భవ్        6సంవత్సరాలు ..  *కుందేలు-సింహం *

8.  చేతన్         5సంవత్సరాలు *కాకి - నీళ్ళు త్రాగడం *

9.  లౌక్య         4సంవత్సరాలు .. *కాకి - నీళ్ళు త్రాగడం *
సాహితి 

10. జుగల్ ప్రీత్   6సంవత్సరాలు. * Rabbit  - Lion * (in English )

తనూజ గారు నిర్వహించిన కధా పోటీ వివరాలు ( బెంగుళూరు )
సంతోష్ 

సమన్విత (5 సం)
ఈ అమ్మయి పావురం,చీమ కథ చెప్పింది.
కథ: చీమ నీటిలో పడితే పావురం నీటిలో ఒక ఆకు వేస్తుంది. .ఆ ఆకు పైకెక్కి చీమ ఒడ్డుకు వస్తుంది.అలా పావురం చీమను కాపాడుతుంది.ఇకొకసారి వేటగాడు పావురాన్ని బాణంతో చంపబోతే,చీమ ఆ వేటగాడి కాలు కొరికి పావురాన్ని రక్షిస్తుంది.
నీతి:ఆపదలో ఉన్నవారికి సహాయం చెయ్యాలి అని చెప్పింది.

ప్రీతిక  (5 సం
ఈ అమ్మయి ఆవు,పులి కథ చెప్పింది.
సాత్విక
కథ: ఒక ఆవు అడవిలో మేత మేస్తోంటే ఒక పులి దాన్ని తింటాను అంటుంది.అప్పుడు ఆ ఆవు నాకు చిన్న దూడ ఉంది అని,,దానికి పాలు ఇచ్చి మంచి బుద్దులు చెప్పి వస్తాను అని అంటుంది.పులి మొదట ఒప్పుకోదు.ఆవు చాలా బతిమాలుకొంటే సరె అంటుంది.దూడకి పాలు ఇచ్చి,యజమాని మాట  వినమని,అందరితో స్నేహంగా ఉండమని,గొడవలు పడవద్దు అని,చెరువుగట్టు మీద ఎగరవద్దు అని చెప్పి పులిదగ్గరకు వచ్చేస్తుంది.పులి,ఆవు మాట తప్పలేదు అని ఆవును తినకుండా వదిలిపెట్టింది.            
నీతి:సత్యమేవ జయతే అని చెప్పింది .

వరున్(4 సం)  (ఈ అబ్బయి మహరాష్ట్ర  అబ్బాయి.ఇంగ్లిష్ లో చెప్పాడు.వాళ్ళ అమ్మ,నాన్న తెలుగు మాట్లడగలరు.)
3 aliens కథ చెప్పాడు.
కథ: మాకు అర్థం కాలేదు.వాళ్ళ అన్న నేర్పించాడు అంట.తరువాత వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పమంటే పాపం వాడికి గుర్తులేదు.వాళ్ళ అన్న ఊరికి వెళ్ళాడంట.అందుకు కథ రాయలేను.
 వేత
నీతి:you shouldnot pick anybodies things

సంతోష్(7 సం)
ఈ అబ్బాయి మిత్రలాభం కథ చెప్పాడు.
సౌజన్య
కథ: ఒక అడవిలో కాకి,ఎలుక,జింక,తాబేలు ఉంటాయి.ఒకసారి వేటగాడు తాబేలును పట్టుకొని వెళ్తుంటాడు,అప్పుడు ఎలుక, మిగిలిన స్నేహితులకి ఒక ఉపాయం(ఇది ఆ అబ్బయికి గుర్తురాక idea అని చెప్పాడు)చెబుతుంది.జింక వేటగాడి దారిలో చనిపోయినట్టు నటిస్తుంది.అప్పుడు వేటగాడు తాబేలును కిందపెట్టి జింక దగ్గరికి వెళ్తుంటాడు.ఆ సమయంలో ఎలుక తాబేలు ఉన్న వలని కొరికేస్తుంది.కాకి కావ్ కావ్ మని అరుస్తుంది,అరుపువిని జింక పారిపోతుంది.అన్ని కలిసి హాయిగా ఉంటాయి.
నీతి:అవసరానికి ఆదుకునే స్నేహితులే నిజమైన స్నేహితులు.

రూప(8 సం) 
ఈ అమ్మాయి ఉపాయం కథ చెప్పింది.
కథ: ఒక బాటసారి వెడుతుంటే ,దొంగలు అతడిని దోచుకోవాలని అనుకుంటారు.అతడి వద్ద ఎమీలేకపోయేసరికి,దొంగల నాయకుడు నువ్వు ఎమి చేస్తుంటావు అని అడుగుతాడు.ఆ బాటసారి నేను ఉపాధ్యాయుడను(ఇది ఆ అమ్మాయి గుర్తురాక Teacher అని చెప్పింది) అంటాడు.అప్పుడు నాయకుడు ఐతే నీకు చాలా తెలివి ఉంటుంది,నేను నీకు ఒక పరీక్ష పెడతాను,నువ్వు సరైన సమాధానం చెబితే నిన్ను వదిలేస్తాము అంటారు.ఒక గుమ్మడికాయ చేతికిచ్చి దాని బరువు ఎంతో చెప్పమంటాడు.ఆ ఉపాధ్యాయుడు ఆలోచించి నీ తలకాయ అంత బరువు ఉంటుంది అని చెబుతాడు.నాయకుడు అతని తెలివికి సంతోషపడి అతడిని వదిలేస్తాడు.                            
నీతి:సమయస్పూర్తి,ఉపాయంతో కష్టాలని జయించవచ్చు.

సాత్విక(7 సం)
వరుణ్ 
ఈ అమ్మాయి కాకిజంట--పాము కథ చెప్పింది.
కథ: ఒక చెట్టులో కాకిజంట ఉండేది.ఆడ కాకి గుడ్లు పెట్టి ఆహారం కోసం బైటికి వెళ్ళాయి.అప్పుడు ఆ చెట్టు కింద పుట్టలోని పాము ఆ గుడ్లన్ని తినేసింది.కాకిజంట అది చూసి ఎంతోదుక్కించాయి.అవి తమ స్నేహితుడైన నక్కకు తమ కథనంతా చెప్పాయి.అప్పుడు నక్క ఒక ఉపాయం చెప్పింది.ఒకరోజు  రాణి స్నానానికి చెరువుదగ్గరికి వచ్చింది.మగకాకి ఆవిడ నగను తీసుకొని పాము తొర్రలోకి వేసింది.కాకిని పట్టుకోవాలి అని వచ్చిన భటులు అది చూసి పుట్టను తవ్వారు. పాము బైటికి వచ్చి ఇక్కడ ఉండటం క్షేమం కాదు అని పారిపోయింది.భటులు నగను తీసుకోని వెళ్ళిపోయారు.అప్పటినుంచి కాకిజంట హాయిగా ఉన్నాయి.                                      

సాహితి(7 సం)

ఈ అమ్మాయి పట్టుదల కథ చెప్పింది.
కథ:మూడు కప్పలు ఒక పెరుగు కుండలో పడిపోయాయి.మొదటి కప్ప నేను కుండనుండి బైటికి రాగలను అనుకుంది.రెండో కప్ప నేను కుండనుండి బైటికి రావడానికి ప్రయత్నం చేస్తాను అనుకుంది.మూడవది నేను కుండలో నుంచి బైటికి రాలేను అనుకుని ఏ ప్రయత్నం చెయ్యలేదు,అందుకు అది మునిగిపోయింది.మొదటి రెండు కప్పలు మెల్లగా ఈదుతున్నాయి,అప్పుడు వెన్న మెల్లగా పైకి వచ్చింది.అలా వచ్చిన వెన్న మీదకు కప్పలు రెండు ఎక్కి బైటపడ్డాయి.                                       
నీతి:పట్టుదల ఉంటే ఏదన్నా సాదించవచ్చు. 

 వేత(7 సం)

ఈ అమ్మాయి దేవత,గొడ్డలి కథ చెప్పింది.
కథ:ఒక పేద కట్టలు కొట్టె అతను ఉండేవాడు.అతను ఒకరోజు కట్టలు కొట్టేందుకు ఒక నదివొడ్డుకు వెళ్ళి కట్టెలు కొడుతొంటే,అతడి గొడ్డలి నీళ్ళలో పడిపోయింది.అతను ఏడుస్తొంటే ఒక దేవత కనిపించి బంగారు గొడ్డలి చూపించింది.అతను నాది కాదు అన్నాడు.మళ్ళీ వెండి గొడ్డలి చూపించింది,నాది కాదు అన్నాడు.కర్ర గొడ్డలిని చూపించింది,అతను నాదే అన్నాడు.దేవత అతను నిజం చెప్పాడు అని మెచ్చుకొని బంగారం,వెండి గొడ్డళ్ళను కూడా ఇచ్చింది.అతడు అవి అమ్మి ధనవంతుడు అయ్యాడు . అతని స్నేహితుడు అతని కథ విని అతనుకూడా ధనవంతుడు కావాలి అనుకుని నది ఒడ్డుకు వెళ్ళి తన కర్ర గొడ్డలిని నదిలోకి విసిరేసి ఏడవటం మొదలు పెట్టాడు.దేవత కనిపించి అతనికి బంగారు,వెండి గొడ్డళ్ళను చూపించింది.అతనికి ఆశపుట్టి అవి నావే అన్నాడు,అప్పుడు దేవతకు కోపంవచ్చి నువ్వు అబద్ధం  చెప్పావు అని తన కర్ర గొడ్డలిని కూడ ఇవ్వలేదు.                                           
నీతి:అబద్ధం చెప్పకూడదు,ఆశపడకూడదు. 

సౌజన్య(11 సం)

ఈ అమ్మాయి చెల్లని నాణ్యం అనే కథ చెప్పింది.
కథ:ఒక ఊరిలో అవ్వా,మనవడు ఉంటారు.మనవడు చదువుకోకుండా అల్లరిగా తిరుగుతుంటాడు.అవ్వ,మనవడికి బుద్ది చెప్పాలని అలోచిస్తుంది.ఒక రోజు మనవడు నాకు ఆకలిగా ఉంది ఒక రూపాయి ఇవ్వు లడ్డు కొనుక్కుంటాను అని అడిగితే,అవ్వ అతనికి చెల్లని నాణ్యం ఇస్తుంది.అతడు అంగడికి వెళ్ళి ఆ నాణం  ఇచ్చి లడ్డు ఇవ్వమంటాడు.అప్పుడు అంగడి వాడు ఇది చెల్లదు అని నవ్వుతాడు.మనవడు అవ్వ దగ్గరికి వచ్చి ఎందుకు ఇలా చేసావు అంటె అవ్వ అంటుంది"నువ్వు చదవకుండా అల్లరిచేస్తే అందరూ కూడా నిన్ను చూసి నవ్వుతారు.నువ్వు కూడా ఈ చెల్లని నాణం  లాగే అవుతావు".అప్పుడు మనవడు సిగ్గు తెచ్చుకొని,బుద్దిగా చదువుకుంటాడు.                                            
నీతి:చదువులేని మనిషికి విలువ ఉండదు. 

చివరగా చెప్పాలి అంటే పిల్లలికి కధలు చెప్పడం పూర్తిగా రావడం లేదు 
ఇది వారి పొరపాటు కాదు ... 
ఇంట్లో కధలు చెప్పేవారు లేకపోవడం ... ఉన్నవారు టివి కి పరిమితం అవడం కారణం ... 
కారణాలు ఏవయినా ... విమర్శ ప్రక్కన పెడితే ... ఒక ప్రయత్నం చేసాము ... చిన్న చిన్న లోపాలు ఉన్నా వాటిని మేము పాజిటివ్ గానే ఈ విషయం తీసుకుంటాము ... 

విమర్శిస్తూ కాలం వృధా చేయకుండా ఆచరణ దిశగా అడుగులు వేయడం బృందావనం లక్ష్యం ... 
ఆ దిశ గానే ఎప్పుడు మా ప్రయాణం ఉంటుంది ... 
మరోసారి ఈ కార్యక్రమ నిర్వాహకులకు, బృందావనం సభ్యులకు ధన్యవాదాలు .. 

No comments:

Post a Comment